శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను నిర్మించిన మైత్ర మూవీ మేకర్స్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో రెండు సినిమాల కోసం అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. ఓ సినిమా సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'రంగస్థలం' అయితే, మరో సినిమా రాంచరణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా అట. ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారట మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు. అయితే తీసుకున్న అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేసాడట త్రివిక్రమ్. ఎందుకు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాడనే వివరాల్లోకి వెళితే...
'అరవింద సమేత వీరరాఘవ' సినిమా తర్వాత రాంచరణ్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడట. అయితే రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ సినిమా కమిట్ అవ్వడంతో వెంకటేష్ తో తదుపరి సినిమా చేయడానికి ఫిక్సయ్యాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాగే రాంచరణ్ తో సినిమా మైత్రి మూవీ మేకర్స్ కోసం కాకుండా తను సొంత బ్యానర్ లా భావించే హారిక హాసిని బ్యానర్ లో చేయాలనుకుంటున్నాడట త్రివిక్రమ్. అందుకే మైత్రి మూవీ మేకర్స్ కి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాడట. వెంకటేష్ తో సినిమా చేసిన తర్వాత రాంచరణ్ తో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట త్రివిక్రమ్. ఆల్ మోస్ట్ ఈ సినిమా 2020 లో సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్.