మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' టైటిల్ తో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా ద్వారా ఇలియానా టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తోంది. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాని సెప్టెంబనర్ 28న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాకి సంబంధించి ఓ ట్విస్ట్ రివీల్ అయ్యింది. అదేంటంటే...
ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. అమర్, అక్బర్, ఆంటోని ఈ మూడు పాత్రల పేర్లు అని కూడా చెప్పుకున్నారు. అయితే ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేయడంలేదట. ఫస్ట్ హాఫ్ లో ముగ్గురు రవితేజలు ఉన్నట్టు కథ సాగుతుందట. కానీ ముగ్గురు కాదు.. ఒక్కడే అన్న విషయం సెకండాఫ్ లో రివీల్ అవుతుందట. ఈ ట్విస్ట్, దీని వెనుకున్న ఫ్లాఫ్ బ్యాక్ ఆడియన్స్ ని థ్రిల్ కు గురి చేస్తుందట. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వరుస ఫ్లాప్ లతో సతమతవుతున్న శ్రీను వైట్ల ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే టార్గెట్ తో ఉన్నాడట. మరి శ్రీను వైట్ల టార్గెట్ నెరవేరుతుందా... వేచి చూద్దాం.