'గీత' అంటే 'భగవద్గీత'... ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి భగవద్గీత తో ఏం పని అనుకుంటున్నారా... 'భగవద్గీత సాక్షిగా' సాయిధరమ్ తేజ్ క్రిమినల్స్ తో పోరాడబోతున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలయ్యింది. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సాయిధరమ్ తేజ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్.
ఓ కొత్త దర్శకుడు సాయిధరమ్ తేజ్ కి ఓ కథ వినిపించాడట. 'భగవద్గీత సాక్షిగా' టైటిల్ కూడా చెప్పాడట. కథ, టైటిల్ నచ్చడంతో సాయిధరమ్ తేజ్ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినట్టు సమాచారమ్. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.