అఖిల్ అక్కినేని ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...
వెంకీ అట్లూరి, అఖిల్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ నెలకొనడంతో షూటింగ్ సజావుగా సాగడంలేదని వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే మా మధ్య ఎలాంటి మనస్ఫర్ధలు లేవని తెలియజేసే ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు అఖిల్. ఈ వీడియోలో... ''అవును. మా మధ్య మనస్ఫర్ధలు నెలకొన్నాయి అని చెబుతూ ఘాటుగా స్పందించిన అఖిల్ ఫైనల్ గా వెంకీ, అఖిల్ కలిసి నవ్వుతూ మా మధ్య ఎలాంటి మనస్ఫర్ధలు లేవని చెప్పకనే చెప్పారు. మొత్తం మీద అఖిల్ తెలివిగలవాడే.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.