'రంగస్థలం' చిత్రంతో కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న డైరెక్టర్ సుకుమార్ తన తదుపరి సినిమాలకు సంబంధించి పక్కా ప్లానింగ్ తో ఉన్నాడట. ప్రిన్స్ మహేష్ బాబుతో తదుపరి సినిమా చేయబోతున్న సుకుమార్ ఈ సినిమాకి అద్భుతమైన స్టోరీ లైన్ ని ఎంపిక చేసుకున్నాడట. తన టీమ్ తో కలిసి ఈ స్టోరీ లైన్ ని డెవలప్ చేస్తున్నాడట సుకుమార్. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న మహేష్ బాబు తదుపరి సినిమా సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కనుంది. ఈ సినిమా వచ్చే యేడాది జనవరిలో ఆరంభమవుతుందట. అదే యేడాది చివరికల్లా ఈ సినిమాని పూర్తి చేసి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్.
రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ఈ యేడాది నవంబర్ లో ఆరంభమవుతుందట. వచ్చే యేడాది చివరికల్లా ఈ సినిమా పూర్తయిపోయింది. కాబట్టి 2020 ఆరంభంలో సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రాంచరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ ప్రాజెక్ట్ కోసం ఓ స్టోరీ లైన్ సుకుమార్ దగ్గర రెడీగా ఉందట. మహేష్ బాబు సినిమా కోసం స్ర్కిఫ్ట్ రెడీ చేస్తూనే, మరోవైపు రాంచరణ్ కోసం కూడా స్ర్కిఫ్ట్ రెడీ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. సో... వచ్చే రెండు సంవత్సరాల్లో ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సుకుమార్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడన్నమాట...!