'తేజ్' ఐ లవ్ యూ తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చేయబోయే సినిమాకి సంబంధించి చాలా వార్తలు ప్రచారమవుతున్నాయి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్' టైటిల్ తో సాయిధరమ్ తేజ్ ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధమయ్యింది. అయితే ఈ ప్రాజెక్ట్ కొంచెం వెనక్కి వెళ్లిందని సమాచారమ్. దాంతో సాయిధరమ్ తేజ్ మరో సినిమాని లైన్లో పెట్టాడని తెలుస్తోంది.
సాయిధరమ్ తేజ్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'విన్నర్'. ఈ సినిమా ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినా సరే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి కారణం కథ అని తెలుస్తోంది. మెడికల్ స్కాం ఆధారంగా గోపీచంద్ ఓ స్టోరీ లైన్ రెడీ చేసాడట. మెడికల్ సిస్టమ్ లో జరిగే అన్యాయాలను ఎదుర్కోనే యువకుడి పాత్రతో ఈ స్టోరీ లైన్ చాలా పవర్ ఫుల్లుగా ఉందట. ఈ స్టోరీ లైన్ సాయిధరమ్ తేజ్ ని బాగా ఇంప్రెస్ చేసిందట. దాంతో ఈ చిత్రం చేయడానికి సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారమ్. మరి స్ర్టాంగ్ కంటెంట్ తో ఓ మంచి మెసేజ్ తో మెగా మేనల్లుడు చేయబోతున్న ఈ సినిమా అతని కెరియర్ కి ఎంత హెల్ప్ అవుతుందో వేచి చూడాల్సిందే.