ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందనుంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరు చేయబోతున్న సినిమాని నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించబోతున్నాడట. ఈ యేడాది నవంబర్ లో ఈ చిత్రం ప్రారంభోత్స కార్యక్రమాన్ని జరిపి, 'సైరా' నరసింహారెడ్డి షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట రాంచరణ్. ఇదిలా ఉంటే...
ఈ సినిమాకి స్టోరీ లైన్ సెట్ చేసేసాడట కొరటాల. ఈ సినిమాలో చిరంజీవి డ్యుయెల్ రోల్స్ లో కనువిందు చేయబోతున్నారని సమాచారమ్. రైతన్నగా ఓ పాత్ర, యన్.ఆర్.ఐ గా మరో పాత్ర ఉంటుందట. సోషల్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుందట. డ్యుయెల్ రోల్ అంటే మెగా ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.