మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కాగా ఇదే బ్యానర్ కోసం రవితేజ మరో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాలనుకున్న సినిమా కోసం 'కందిరీగ' ఫేం డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కథ తయారు చేసిన విషయం తెలిసిందే. తమిళ్ సినిమా 'తెరి' ఆధారంగా ఈ సినిమా స్టోరీ లైన్ ని ప్రిపేర్ చేసారు. ఇప్పుడు సినిమాల్లో నటించడానికి పవన్ కళ్యాణ్ నో చెప్పడంతో డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఇదే స్టోరీ లైన్ ని మాస్ మహారాజా రవితేజకు చెప్పడం, ఈ సినిమాకి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
అయితే ఈ మధ్య రవితేజ కూడా ఈ సినిమా చేయడంలేదనే వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ తాజా వార్తల ప్రకారం ఈ సినిమాని సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈలోపు 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలనుకుంటున్నాడట రవితేజ. 'తెరి' తెలుగు రీమేక్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన రానుందని సమాచారమ్.