'ఫిదా' చిత్రం తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తదుపరి సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. తాజా వార్తల ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో ఓ సినిమా చేయడానికి శేఖర్ కమ్ముల సన్నాహాలు చేస్తున్నాడని సమాచారమ్.
'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ 'వర్మ' ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు ధృవ్ విక్రమ్. ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వకముందే శేఖర్ కమ్ముల చేయబోతున్న సినిమా కోసం ధృవ్ ని కాంటాక్ట్ చేసారట. బ్యూటిఫుల్ రొమాంటిక్ స్టోరీ లైన్ తో శేఖర్ కమ్ముల తయారు చేసిన ఈ స్ర్కిఫ్ట్ విక్రమ్, ధృవ్ కి బాగా నచ్చిందట. దాంతో తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా పరిచయమవ్వడం ధృవ్ కెరియర్ కి హెల్ప్ అవుతుందని భావిస్తున్న విక్రమ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి. సో... శేఖర్ కమ్ముల ఈసారి ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడన్నమాట...!