గత రెండు రోజుల నుంచి నిర్మాత డి.వి.వి.దానయ్య గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఆ వార్త 'భరత్ అనే నేను' చిత్రానికి సంబంధించింది. అదేంటంటే... డైరెక్టర్ కొరటాల శివ కి, హీరోయిన్ కియారా అద్వానీకి నిర్మాత దానయ్య పారితోషికం సెటిల్ చేయలేదని, ఇంకా పెండింగ్ లోనే ఉందనేది ఆ వార్త. 'భరత్ అనే నేను' తో భారీ విజయాన్ని, లాభాలను అందుకున్న దానయ్య పారితోషికం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టడమేంటని జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజంలేదట. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల, కియారా చెప్పేసారు.
కొరటాల శివ ఈ వార్తలపై స్పందిస్తూ - ''భరత్ అనే నేను చిత్రానికి సంబంధించి నాకు పారితోషికం ఇంకా సెటిల్ అవ్వలేదనే వార్తల్లో నిజంలేదు. నిర్మాత దానయ్య గారు చాలా క్లారటీ ఉన్న వ్యక్తి అని చెప్పారు.
ఇక కియారా అద్వానీ అయితే - ''డివివి ఎంటర్ టైన్ మెంట్స్ లో వెంటవెంటనే సినిమాలు చేస్తున్నాను. నాకు ఈ బ్యానర్ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వెంటనే వెంటనే సినిమాలు ఎందుకు చేస్తాను. ఇక ముందు కూడా దానయ్య గారి సినిమాల్లో నటించాలనుకుంటున్నాను. కాబట్టి ప్రచారమవుతున్న వార్తల్లో నిజంలేదు'' అని స్పష్టం చేసింది.
దీన్నిబట్టి ఈ వార్తలు కేవలం వదంతులేనని ఫిక్స్ అయిపోవచ్చు.