'ఆర్ ఎక్స్ 100' తో భారీవిజయాన్ని అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్. బోల్డ్ కంటెంట్ తో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రంగా 'ఆర్ ఎక్స్ 100' ని మలిచి బి, సి సెంటర్స్ ఆడియన్స్ మనసులను దోచేసుకున్నాడు. గత వారం విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా విజృంభిస్తోంది. దాంతో అందరి దృష్టి డైరెక్టర్ అజయ్ భూపతి పైన పడింది. ప్రముఖ నిర్మాతలు ఈ డైరెక్టర్ తో సినిమాలు నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మూడు పెద్ద బ్యానర్స్ నుంచి అజయ్ భూపతికి అడ్వాన్స్ లు కూడా అందాయట. ఆ మూడు బ్యానర్స్ వివరాల్లోకి వెళితే...
వరుస విజయాలతో టాలీవుడ్ లో తమకంటూ ఓ స్థానం సంపాదించుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు అజయ్ భూపతికి అడ్వాన్స్ ఇచ్చారట. భవ్య క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి కూడా ఈ డైరెక్టర్ కి అడ్వాన్స్ లు అందినట్టు సమాచారమ్. ఇక హీరో నితిన్ అయితే అజయ్ భూపతిని పర్సనల్ గా పిలిచి శ్రేష్ఠ్ మూవీస్ కోసం ఓ సినిమా చేసి పెట్టాలని డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి 'ఆర్ ఎక్స్ 100' విజయం అజయ్ భూపతికి ఏ రేంజ్ లో కిక్ ఇచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఇన్ని బంపర్ ఆఫర్స్ అజయ్ ముందు ఉన్నాయి. మరి తదుపరి సినిమా ఏ హీరోతో, ఏ బ్యానర్ కోసం చేస్తాడో వేచి చూద్దాం.