రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో 'రంగస్థలం' చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ మరో రెండు సినిమాలను సుకుమార్ దర్శకత్వంలో నిర్మించడానికి సమాయత్తమవుతున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. మరో స్టార్ హీరోతో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారట మైత్రి మూవీ మేకర్స్.
కాగా ఈ సినిమాల కోసం డైరెక్టర్ సుకుమార్ కి మైత్రి మూవీ మేకర్స్ 6 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారట. అడ్వాన్స్ 6 కోట్లు అంటే ఇక ఈ రెండు సినిమాలకు పారితోషికంగా సుకుమార్ ఎంత అందుకోబోతున్నాడో ఊహించవచ్చు. ఇంత పారితోషికం కావాలని సుకుమార్ డిమాండ్ చేయడం కాదు, నిర్మాతలే సుకుమార్ కి భారీ పారితోషికం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారట. ఈ భారీ డీల్ తో పాటు సుకుమార్ కి మైత్రి మూవీస్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. సుకుమార్ అసిస్టెంట్స్ తో మైత్రి మూవీ మేకర్స్ సినిమాలు నిర్మించనుందట. ఈ సినిమాలకు సుకుమార్ క్రియేటివ్ హెడ్ గా వ్యవహరించనున్నారట. సో... సుకుమార్ కి ఈ బ్యానర్ లో ఎంతటి ప్రాముఖ్యత నెలకొందో ఊహించవచ్చు.