ఓ అమ్మాయికి అన్యాయం జరిగినట్టు డైరెక్టర్ సుకుమార్ నోటీసుకు వచ్చింది. పైగా తన సినిమా 'రంగస్థలం' తోనే ఆమెకు అన్యాయం జరిగిందని తెలుసుకుని సుకుమాన్ చాలా ఫీలైపోయారట. తనకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోకుండా, వెంటనే ఆ అమ్మాయికి అక్షరాల లక్ష రూపాయలు పంపించారు. ఇంతకీ ఎవరా అమ్మాయి... ఎందుకు ఆమెకు అన్యాయం జరిగింది అనే విషయంలోకి వెళితే...
'రంగస్థలం' సినిమాలో 'జిల్ జిల్ జిగేల్ రాణి...' పాట పాడింది వెంకట లక్ష్మీ అనే అమ్మాయి. ఈవిడ ఉత్తరాంధ్రకు చెందినావిడ. లోకల్ గా ఆమె పాటలకు పాపులార్టీ ఉంది. ఆవిడ వాయిస్ విన్న సుకుమార్ 'రంగస్థలం' సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. ఇంతవరకూ బాగానే ఉన్నా... ఆమెకు పాట పాడినందుకు పారితోషికం అందలేదట. మధ్యవర్తులే మింగేసారట. ఈ విషయం లోకల్ మీడియాలో వచ్చింది. అలాగే సుకుమార్ దృష్టికి కూడా వచ్చింది. నాకెందుకులే... నిర్మాతలు చూసుకుంటారు అని దులిపేసుకోకుండా, లక్ష రూపాయలు ఆమెకు పంపించారట సుకుమార్. లోకల్ టాలెంట్ ని వాడుకుని వారికి గుర్తింపుగానీ, పారితోషికంకానీ ఇవ్వకుండా వదిలేసే వాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి వారందరూ సుకుమార్ ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి... కాదంటారా...!