మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధమవుతోందనే వార్తలు గత కొన్నాళ్లుగా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా వార్తల ప్రకారం వైష్ణవ్ తేజ్ సినిమా కొంతమేర షూటింగ్ జరిగిందట.
'నేల టిక్కెట్' నిర్మాత రామ్ తల్లూరి వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. 'అప్పట్లో ఒక్కడుండేవాడు' ఫేం సాగర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వైష్ణవ్ తేజ్ నటన, డ్యాన్స్, ఫైట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. మరి మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న ఈ హీరో ఎంట్రీ ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం. ఈ హీరోకి వెల్ కమ్ చెప్పడానికి మెగాభిమానులు రెడీగానే ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.