యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.
కాగా తాజా వార్తల ప్రకారం రాజమౌళి తన తనయుడు కార్తీకేయను రంగంలోకి దింపాడట. 'మగధీర' సినిమా అప్పట్నుంచే కార్తీకేయ తండ్రి రాజమౌళి చేస్తున్న సినిమాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. లొకేషన్స్, ఆర్టిస్ట్ ల సెలక్షన్... ఇలా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఓ సందర్భంలో కార్తికేయ ఆల్ రౌండర్ అని స్వయంగా రాజమౌళి చెప్పి, కొడుకును ప్రశంలతో ముంచెత్తాడు.
తాజాగా ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ కి సంబంధించి కూడా కార్తికేయ ప్రతి విషయంలోనూ కేర్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం కార్తికేయ కేరళ వెళ్లాడు. అక్కడ థియేటర్ ఆర్టిస్ట్ లను ఆడిషన్స్ కోసం పిలిపించారట. మల్టీస్టారర్ కి చాలామంది ఆర్టిస్ట్ లు కావాలి కాబట్టి, ఆర్టిస్ట్ లను సెలెక్ట్ చేసే పనిని కార్తికేయకు అప్పగించాడట రాజమౌళి. అందుకే కేరళ వెళ్లాడని సమాచారమ్. సో... మల్టీస్టారర్ కోసం రాజమౌళి కుటుంబం రంగంలోకి దిగేసిందన్నమాట...!