మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రంలో భారీ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఓ ముఖ్యమైన గెస్ట్ రోల్ కోసం ముగ్గురు హీరోయిన్లు ఆడిషన్స్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు ఎవరనే విషయంలోకి వెళితే...
రంభ, పూనమ్ కౌర్, 'ఆనందం' ఫేం రేఖ. ఈ ముగ్గురిలో ఎవరికి 'సైరా' లో నటించే అవకాశం దక్కుతుందని పరిశీలిస్తే... 'ఆనందం' రేఖ కి అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే...
రంభ ప్రెగ్నెంట్. దాంతో 'సైరా' టీం అడిగిన డేట్ కేటాయించలేకపోతోందట. కాబట్టి రంభ ఈ అవకాశాన్ని మిస్ అయినట్టేనని ఫిల్మ్ నగర్ టాక్. ఇక పూనమ్ కౌర్ ని తీసుకోవడానికి ఓ చిక్కు ఉందని తెలుస్తోంది. కొన్నాళ్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి పూనమ్ కౌర్ కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల పవన్ కళ్యాణ్ అభిమానులు పూనమ్ కౌర్ పై గుర్రుగా ఉన్నారు. ఈ సమయంలో పూనమ్ కౌర్ కి 'సైరా' లో నటించే అవకాశం ఇస్తే... పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందేమోననే ఆలోచనలో పడ్డారట. ఈ నేపధ్యంలో 'ఆనందం' ఫేం రేఖకు ఈ సినిమాలో నటించే అవకాశం మెండుగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా ఎవరికి ఈ అవకాశం దక్కుతుందో వేచి చూడాల్సిందే.