పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు విజయ్ దేవరకొండ రేంజ్ ని మార్చేసాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో హాట్ హీరో. అతని డేట్స్ దొరికితే ఆ నిర్మాత పంట పండినట్టే. డియర్ కామ్రేడ్, నోటా, టాక్సీవాలా చిత్రాలు చేస్తున్న విజయ్ దేవరకొండ తనకు లైఫ్ ఇచ్చిన నిర్మాతకు రెండు సినిమాలు సైన్ చేసి, ఆ బ్యానర్ తో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నాడని తెలుస్తోంది.
'నువ్విలా' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాల తర్వాత 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసాడు. ఈ సినిమా అతని కెరియర్ ని మలుపు తిప్పేసింది. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండకు బాగా పాపులార్టీ వచ్చింది. ఈ సినిమాని నిర్మించింది ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూతుళ్లు. దాంతో వీరితో విజయ్ కి ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. వీరు నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'మహానటి' లో కూడా విజయ్ దేవరకొండ కీలక పాత్ర చేసాడు.
తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్ లో రెండు సినిమాలు చేయడానికి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ రెండు సినిమాలకు సైన్ చేసినందుకుగానూ వైజయంతి అధినేత అశ్వనీదత్ భారీ పారితోషికం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ డేట్స్ కోసం భారీ డిమాండ్ ఉంది. ఈ టైమ్ లో ఒకే బ్యానర్ కోసం రెండు సినిమాలు సైన్ చేయడం అంటే మాములు విషయం కాదు. తనకు లైఫ్ ఇచ్చిన బ్యానర్ కాబట్టి, విజయ్ దేవరకొండ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. ఏదేమైనా నిర్మాత అశ్వనీదత్ , విజయ్ దేవరకొండ మధ్య భారీ డీల్ సెట్ అయ్యింది. మరి ఈ బ్యానర్ లో రాబోతున్న రెండు సినిమాలు విజయ్ దేవరకొండ కెరియర్ ని ఏ రేంజ్ కి తీసుకెళతాయో వేచిచేద్దాం.