మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'RC12' చిత్రం షూటింగ్ నిమిత్తం అజర్ బైజాన్ లో ఉన్నాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ ని జార్జియాలో ప్లాన్ చేసారు. కాగా జార్జియాకి వెళ్లేముందు చిరు అజర్ బైజాన్ లో ల్యాండ్ అయ్యారు. తనయుడు రాంచరణ్ షూటింగ్ సెట్ కి వెళ్లారు. నిన్న (19.9.2018) అంతా ఆ సెట్ లోనే ఉన్న చిరు ఈ రోజు, రేపు కూడా చరణ్ తో పాటే ఉండబోతున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత జార్జియా వెళ్లబోతున్నారట. ఇదిలా ఉంటే...
చిరంజీవి, రాంచరణ్ ఇద్దరూ ఒకే మూడ్ లో ఉండబోతున్నారు. అజర్ బైజాన్ లో రాంచరణ్ పాల్గొనగా భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నారట డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఇక చిరంజీవి సైతం 'సైరా' నరసింహారెడ్డి చిత్రం కోసం భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలోనే పాల్గొనబోతున్నారు. దాదాపు 20 రోజుల పాటు ఓ వార్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసారట డైరెక్టర్ సురేందర్ రెడ్డి. సో... చిరు, చరణ్ ఇద్దరూ ఇరగదీసే మూడ్ లోనే ఉండబోతున్నారన్నమాట...!