స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట. కాగా తాజా వార్తల ప్రకారం ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రాలకు డైలాగులు అందిస్తున్న సాయిమాధవ్ బుర్రా రంగంలోకి దిగారని సమాచారమ్.
'ఎన్టీఆర్' బయోపిక్, 'సైరా' చిత్రాలకు డైలాగులు అందిస్తున్న సాయిమాధవ్ బుర్రా టాలీవుడ్ లో తెరకెక్కనున్న అత్యంత ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ #RRR కి డైలాగులు రాయబోతున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ సమకూర్చుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ స్టోరీ లైన్ కి సాయిమాధవ్ డైలాగ్ వెర్షన్ రాస్తున్నారట. 'కృష్ణం వందే జగద్గురం', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'కంచె', 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'మహానటి' వంటి చిత్రాలకు పదునైన డైలాగులు రాసి తన సత్తా చాటుకున్నారు సాయిమాధవ్. ఈ సినిమాల్లోని డైలాగులకుగానూ టాలీవుడ్ లో సాయిమాధవ్ కు స్పెషల్ మెన్షన్ దక్కింది. తెలుగు ఆడియన్స్ కి ఆయన చాలా దగ్గరయ్యారు. ఇక ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ తో ఆయన పేరు టాలీవుడ్ లో మారు మ్రోగిపోతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.