నితిన్ హీరోగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం 'శ్రీనివాస కళ్యాణం' గత నెల విడుదలై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని తెగ చూసేస్తారని సినిమా విడుదలకు ముందు నిర్మాత దిల్ రాజు చెప్పాడు. కానీ ఇందుకు భిన్నంగా రిజల్ట్ ఉండటంతో దిల్ రాజు సైతం షాకయ్యాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ వ్యాల్యూని దిగజార్చింది. ఖచ్చితంగా దిల్ రాజు ఓ సినిమా నిర్మించాడంటే మినిమమ్ గ్యారంటీ, హిట్ అనే ఇమేజ్ ని ఈ సినిమా తుడిచిపెట్టేసింది.
ఇటీవల ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో అప్ లోడ్ చేసారు. మాములుగా అమెజాన్ ప్రైమ్ లో అప్ లోడ్ చేసే కొత్త సినిమా కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అప్ లోడ్ చేసిన వెంటనే టివిల్లో, సెల్ ఫోనుల్లో సినిమాని చూసేస్తారు. అయితే 'శ్రీనివాస కళ్యాణం' విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఈ సినిమాని చూసిన వారు సోషల్ మీడియాలో ట్రాల్ చేస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ సినిమాని రిజెక్ట్ చేసారు. సినిమాపై వస్తున్న నెగటివ్ ఫీడ్ బ్యాక్ చూస్తుంటే, దిల్ రాజు ఇమేజ్ ని ఈ సినిమా బాగా దెబ్బతీసిన విషయం తెలుస్తోంది. నిజంగా ఇది దిల్ రాజుకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు.