యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాని పూర్తి చేసే పని మీద ఉన్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ తో కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా 2020 సమ్మర్ కానుకగా థియేటర్స్ కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. దీని తర్వాత ఎన్టీఆర్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్. ఆ ప్రాజెక్ట్ కి వివరాల్లోకి వెళితే...
ఎన్టీఆర్ తో భారీ నిర్మాత అశ్వనీదత్ 'స్టూడెంట్ నెం.1' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ కి ఎలాంటి మలుపు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఇదే నిర్మాత ఎన్టీఆర్ తో 'కంత్రీ', 'శక్తి' వంటి ఫ్లాప్ సినిమాలు చేసారు. కాగా నిర్మాత అశ్వనీదత్ మరో సినిమాని ఎన్టీఆర్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ కన్ ఫార్మ్ అయినట్టేనని ఫిక్స్ అయిపోవచ్చు. 2020 లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందట. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారమ్. ఆల్ రెడీ ఈ ప్రాజెక్ట్ కోసం అట్లీ కథ కూడా తయారు చేస్తున్నాడట. సో... ఓ భారీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధమవుతోందని చెప్పొచ్చు.