వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన 'అర్జున్ రెడ్డి' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్ కి రంగం సిద్ధమయ్యింది. వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలోనే హిందీ రీమేక్ తెరకెక్కనుండగా 'అర్జున్ రెడ్డి' రీమేక్ లో నటించే అవకాశం షాహీద్ కపూర్ కి దక్కింది. తెలుగు వెర్షన్ చూసిన షాహీద్ కపూర్ మారు మాట్లాడకుండా ఈ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్.
కాగా హిందీ వెర్షన్ కోసం తారా సుతారియాని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ నుంచి తప్పుకుంది. తాజా వార్తల ప్రకారం 'భరత్ అనే నేను' చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన కియారా అద్వాని 'అర్జున్ రెడ్డి' రీమేక్ లో నటించే అవకాశం కొట్టేసిందని తెలుస్తోంది. 'ఫుగ్లీ', 'యం.యస్.ధోనీ', 'మెషిన్' చిత్రాల ద్వారా బాలీవుడ్ ఆడియన్స్ మనసులను దోచుకుంది. కాకపోతే ఇంతకముందు కియారా చేసిన పాత్రలు వేరు. ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ లో చేయబోతున్న పాత్ర వేరు. తెలుగు వెర్షన్ లో నటించిన షాలిని పాండే ని ఈ సినిమా యూత్ కి హాట్ ఫేవరేట్ అయ్యేలా చేసింది. మరి కియారా అద్వానీ కెరియర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచిచూద్దాం.