యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మించనున్న మల్టీస్టారర్ ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది. వచ్చే యేడాది జనవరి చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ఆరంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...
ఈ సినిమాకుగానూ ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి పారితోషికం తీసుకోవడంలేదట. వచ్చిన లాభాల్లో షేర్ తీసుకునేలా నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి కాంబినేషన్ సినిమాకి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 250 కోట్లుతో సినిమా చేస్తే, 400 నుంచి 500కోట్లు వరకూ బిజినెస్ చేస్తుంది. పైగా హీరోలు, డైరెక్టర్ ఒక మాట మీద ప్రాజెక్ట్ చేస్తే, బడ్జెట్ పెరిగే అవకాశంలేదు. శాటిలైట్, ఇతర రైట్స్ కోసం కూడా ఎగబడతారు. ఇవన్ని దృష్టిలో పెట్టుకునే రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ లాభాల్లో వాటా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట.
సో... ఓ భారీ సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగుతున్నారు కాబట్టి, అటు నిర్మాత కూడా భారీ లాభాలను చవిచూసే అవకాశముందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.