'ఎన్టీఆర్' బయోపిక్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రేపల్లెలో జరుగుతోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొనబోతోందని సమాచారమ్. అతిలోకసుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ మెరవనుంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న బాలయ్యతో కలిసి శ్రీదేవి పాత్ర చేయబోతున్న రకుల్ చిందేయబోతోందట. ఈ ఇద్దరూ కలిసి చిందేయబోతున్న పాట ఏంటో తెలుసా...
మహానటుడు ఎన్టీఆర్ సినిమాల్లో ఎన్నో హిట్ పాటలున్నాయి. ఆ హిట్ సాంగ్స్ లో 'ఆకుచాటు పిందె తడిసే...', పాటకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు ఈ పాటలను హమ్ చేయకుండా ఉండరు. కాగా ఈ పాట 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఉంటుంది. ఎన్టీఆర్ - కథానాయకుడు టైటిల్ తో 'ఎన్టీఆర్' బయోపిక్ ఫస్ట్ పార్ట్ రానుంది. సో.. ఫస్ట్ పార్ట్ లోనే ఈ పాట ఉంటుంది. మరి బాలయ్య, రకుల్ ఈ హిట్ సాంగ్ కి చిందేసి ఎన్టీఆర్, శ్రీదేవిలను గుర్తుకు తెస్తారేమో చూద్దాం.