యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత - వీరరాఘవ' చిత్రం దసరా కానుకగా ఈ నెల 11న థియేటర్స్ కి వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా స్పెషల్ షోలు స్ర్కీనింగ్ కోసం ఏ.పి గవర్నమెంట్ ఓ జి.వో పాస్ చేసింది.
ఆ జి.వో ప్రకారం అక్టోబర్ 11 ఉదయం 5 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ షోలు పెద్ద ఎత్తున స్ర్కీనింగ్ కానున్నాయి. అక్టోబర్ 18 వరకూ రోజు 6 షోలు స్ర్కీనింగ్ చేసుకోవచ్చని ఏ.పి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులకు వారం ముందే దసరా పండగ వచ్చేస్తుంది. వారం పాటు స్పెషల్ షోలు అంటే ఏ రేంజ్ లో ఈ సినిమా వసూలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా తో ఎన్టీఆర్ బిజీ అయిపోతాడు. ఈ సినిమా థియేటర్స్ కి రావడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే 'అరవింద సమేత' రిలీజ్ ని ఓ పండగలా సెలబ్రేట్ చేసుకోవాలని ఎన్టీఆర్ అభిమానులు ఫిక్స్ అయ్యారట. సో... సంబరాలు అంబరాన్ని అంటబోతున్నాయని చెప్పొచ్చు.