పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కి తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా అలరించిన 'అత్తారంటికి దారేది' చిత్రం తమిళంలో రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని రీమేక్ చేస్తోంది.
ఈ రీమేక్ లో శింబు హీరోగా నటిస్తోంటే, మేఘా ఆకాష్, క్యాథరీన్ థెరిస్సా కథానాయికలుగా నటిస్తున్నారు. ఖుష్భూ భర్త సుందర్.సి ఈ రీమేక్ కి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కాగా తెలుగు వెర్షన్ లో పవన్ కళ్యాణ్ అత్తగా నదియా ఎంత పవర్ ఫుల్ రోల్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాత్రను తమిళంలో ఖుష్భూ నటిస్తుందనే వార్తలు ప్రచారమయ్యాయి. అయితే ఈ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారు. నదియా చేసిన అత్త పాత్రను తనదైన శైలిలో చేసి మెప్పించగల సత్తా రమ్యకృష్ణకు ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం 'అత్తారింటికి దారేది' తమిళ్ రీమేక్ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మరి తమిళ్ రీమేక్ కోలీవుడ్ ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుందో వేచిచూద్దాం.