స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ సినిమా చేస్తున్నాడంటే, ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ముందు గ్రౌండ్ వర్క్ చాలా చేస్తారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ మల్టీస్టారర్ కోసం ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలోని కొన్ని కీలక పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేసారట.
సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ లకు మేకప్ టెస్ట్ లు, డైలాగ్ డెలివరి కి సంబంధించి టెస్ట్ లు కూడా నిర్వహిస్తున్నారట. ఇవన్ని పూర్తయిన తర్వాత వారి వారి క్యారెక్టర్ కి సంబంధించిన ట్రయినింగ్ ఆరంభమవుతుందట. దాదాపు 15 రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించడానికి ప్లాన్ చేసారట రాజమౌళి. ఈ వర్క్ షాప్ లో రాంచరణ్, ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నారట. అలాగే మెయిన్ టెక్నిషియన్స్ కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. జనవరి నెలాఖరులో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. ఈలోపు స్ర్కిఫ్ట్, నటీనటుల ఎంపిక, లొకేషన్స్ ని ఫైనలైజ్ చేయడంలాంటి కార్యక్రమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట రాజమౌళి. సో... రాజమౌళి అండ్ టీం మల్టీస్టారర్ కోసం పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారని చెప్పొచ్చు.