మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' నరసింహారెడ్డి షూటింగ్ నిమిత్తం జార్జియా లో ఉన్నారు. సినిమాకి సంబంధించిన కీలక షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ అనుకున్న దానికంటే వారం ముందే పూర్తయిపోతుందట. ఇదిలా ఉంటే...
ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయబోతున్నారు. రాంచరణ్ ఈ సినిమాని నిర్మింబోతున్నారు. రాంచరణ్ తో పాటు కొరటాల ఫ్రెండ్స్ మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించే అవకాశముందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా స్టోరీ లైన్, టైటిల్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
ఈ సినిమాలో చిరంజీవి డ్యుయెల్ రోల్స్ లో కనువిందు చేయబోతున్నారట. రైతన్నగా ఓ పాత్ర, యన్.ఆర్.ఐ గా మరో పాత్ర ఉంటుందట. సోషల్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుందట. కాగా ఈ సినిమాకి 'రైతు' టైటిల్ ని పరిశీలిస్తున్నారట. రైతు బాంధవుడిగా చిరు క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుందని, ఆల్ రెడీ ఈ క్యారెక్టర్ కి సంబంధించి స్ర్కిఫ్ట్ వర్క్ పూర్తయిందని సమాచారమ్. మొత్తం మీద తనదైన శైలిలో మంచి మేసేజ్ తో మెగాస్టార్ చిరంజీవితో ఓ కమర్షియల్ సినిమా చేయడానికి కొరటాల సమాయత్తమవుతున్నారని చెప్పొచ్చు.