మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. డిసెంబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే...
ఇదే బ్యానర్ కోసం రవితేజ మరో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాలనుకున్న సినిమా కోసం 'కందిరీగ' ఫేం డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కథ తయారు చేసిన విషయం తెలిసిందే. తమిళ్ సినిమా 'తెరి' ఆధారంగా ఈ సినిమా స్టోరీ లైన్ ని ప్రిపేర్ చేసారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సినిమాలు చేయడానికి నో చెప్పడంతో ఈ సినిమా రవితేజతో చేయడానికి ప్లాన్ చేసారు.
కాగా తాజా వార్తల ప్రకారం 'తెరి' స్టోరీ లైన్ ని మాత్రమే తీసుకుని, సీన్ లు కొత్తగా రాసారట. 'తెరి' స్టోరీ లైన్ కాబట్టి, క్యారెక్టర్స్ అవే ఉంటాయి. కానీ సీన్స్ కొత్తగా ఉంటాయట. ఈ తెలుగు రీమేక్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చబోతున్నాడట. ఈ నెలాఖరులో కానీ, వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కానీ ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరపడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారమ్. సో... పవన్ కళ్యాణ్ వదిలేసిన స్టోరీతో రవితేజ సినిమా చేయబోతున్నాడన్నమాట...!