మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న #RC12 చిత్రానికి ఓ మార్పు జరిగింది. ప్రస్తుతం ఆ మార్పు గురించే టాలీవుడ్ లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ సినిమాకి జరిగిన మార్పేంటి అనే వివరాల్లోకి వెళితే...
రాంచరణ్, బోయపాటి సినిమాకి సినిమాటోగ్రాఫర్ విషయంలో మార్పు జరిగింది. ఈ సినిమాకి రుషి పంజాబి కెమెరామ్యాన్ గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 100 రోజుల పైగా జరిగింది. ఇంకా 30 రోజులపైనే ఈ చిత్రం షూటింగ్ జరగాల్సి ఉందట. కాగా కమిట్ అయిన డేట్స్ అయిపోవడం, వేరే కమిట్ మెంట్స్ ఉండటంతో ఈ సినిమా నుంచి రుషి పంజాబి తప్పుకున్నారని తెలుస్తోంది. ఆయన స్థానంలో ఆర్ధర్ విల్సన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. అయితే డేట్స్ ప్రాబ్లమ్ వల్లే ఈ మార్పు జరిగిందా లేక వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అనే గుసగుసలు కూడా వినబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ, ఈ సినిమాకి మార్పు జరిగిందనేది కన్ ఫార్మ్. అలాగే ఈ సినిమాకి 'వినయ విధేయ రామ' టైటిల్ ని పెట్టాలనుకుంటున్నారట. మరి ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా.. లేదా మార్పు జరుగుతుందా వేచి చూడాల్సిందే.