మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు చిరు. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి హీరోయిన్ ని కన్ ఫార్మ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.
ఖైదీ.నెం.150 కోసం కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. సైరా నరసింహారెడ్డి లో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ నేపధ్యంలో చిరు తదుపరి సినిమాకి సీనియర్ హీరోయిన్ ని తీసుకోవాలా లేక కొత్త అమ్మాయిని రంగంలోకి దింపాలా అనే చర్చలు జరుగుతున్నాయట. హీరోయిన్ పాత్ర మెచ్చుర్డ్ గా ఉంటుందట. దాంతో బాలీవుడ్ హీరోయిన్ హ్యుమా ఖురేషీ ని తీసుకోవాలనే ఆలోచనలో కొరటాల ఉన్నారట. అయితే హ్యుమా ఖురేషీని హీరోయిన్ గా తీసుకోవడం మెగాభిమానులకు అంతగా నచ్చలేదని తెలుస్తోంది. రజనీకాంత్ 'కాలా' చిత్రంలో హ్యుమా ఖురేషీ కొంచెం వయసున్న పాత్రలో నటించడం, బాలీవుడ్ లో ఆమె సెకండ్ రేంజ్ హీరోయిన్ గానే మిగిలిపోవడంతో చిరు పక్కన ఆమెను నటింపజేయడం కరెక్ట్ కాదని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారట. అందుకే హ్యుమా ఖురేషీని హీరోయిన్ గా తీసుకోవద్దని కొరటాలకు సంకేతాలు పంపిస్తున్నారట. మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ తో కొరటాల కూడా హ్యుమా ఖురేషీ విషయంలో వెనకడుగు వేసారని సమాచారమ్. మరి ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.