ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడనే వార్తలు ఉన్నాయి.
అయితే తాజా వార్తల ప్రకారం సందీప్ వంగాతో సినిమా చేయడానికి మహేష్ బాబు రెడీగా లేడట. మహేష్ బాబుకు గతంలో డైరెక్టర్ క్రిష్ ఓ కథ చెప్పాడు. ఈ స్టోరీ లైన్ బాగుందని చెప్పిన మహేష్ కొన్ని మార్పులు చెప్పి ఫుల్ స్ర్కిఫ్ట్ తో రమ్మని క్రిష్ కు చెప్పినట్టు వార్తలు ఉన్నాయి. ఈ చిత్రానికి 'శివం' టైటిల్ అనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ స్టోరీ లైన్ తో సినిమా చేయడానికి మహేష్ బాబు రెడీగా ఉన్నాడని సమాచారమ్. ఈ సినిమాని మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని సమాచారమ్. 'ఎన్టీఆర్' బయోపిక్ పూర్తి చేసిన వెంటనే క్రిష్ ఈ ప్రాజెక్ట్ పైనే దృష్టి పెట్టనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే కనుక జరిగితే... మరో క్రేజీ కాంబినేషన్ కి రంగం సిద్ధమైనట్టే...!