అవసరం ఎంతటివారినైనా కాంప్రమైజ్ అయ్యేలా చేస్తుంది. ఈ మాట ఇప్పుడు నిర్మాత దిల్ రాజుకు సరిగ్గా సూట్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇంతకీ రాజుగారు కాంప్రమైజ్ అయ్యింది ఎక్కడ... ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు అని ఆలోచిస్తున్నారా... ఆ విషయంలోకే వెళదాం...
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మహర్షి' సినిమాకి దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ నిమిత్తం దిల్ రాజు 25కోట్లు డిమాండ్ చేసారట. అయితే 'మహర్షి' సినిమాలో మహేష్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. యు.యస్ బ్యాక్ డ్రాప్. యాక్షన్ సీక్వెన్స్ తక్కువ వోల్డేజ్ తోనే ఉంటాయని లెక్కలు వేసుకుని దిల్ రాజు 25కోట్ల డిమాండ్ కి ఎవ్వరూ తలొగ్గలేదట. 20 కోట్లు వరకూ బేరం వచ్చిందట. ముందు 20 కోట్లకు రైట్స్ ఇవ్వడానికి ససేమిరా అన్న దిల్ రాజు, డబ్బు అవసరం చాలా ఉండటంతో కాంప్రమైజ్ అయ్య 20కోట్లకే 'మహర్షి' హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ని ఇచ్చేసారట. సో.. దిల్ రాజు డిమాండ్ వర్కవుట్ అవ్వలేదన్నమాట...!