యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ #RRR ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు (11.11) 11 గంటలకు జరగనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరగనున్న ఈ భారీ మల్టీస్టారర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోతున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ తో పాటు పలువురు సెలబ్రెటీస్ ఈ వేడుకలో పాల్గొనబోతున్నారట. ఇదిలా ఉంటే...
రేపు సినిమా ప్రారంభోత్సవం జరిగిన అనంతరం రాజమౌళి ఈ సినిమా జానర్ గురించి, సినిమాకి సంబంధించి ఇతర విశేషాలను రివీల్ చేసే అవకాశముందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో నటించబోతున్న హీరోయిన్లు, ఇతర నటీనటుల విషయాలను కూడా ప్రకటించబోతున్నారట. ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి తెరపంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. రాజమౌళి వల్ల మాత్రమే సాధ్యమవుతోన్న ఈ మల్టీస్టారర్ ని 300కోట్ల బడ్జెట్ తో నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మించబోతున్నారు. సో... మరో ప్రతిష్టాత్మక చిత్రానికి రేపు శ్రీకారం జరగనుంది. లెటజ్ వెయిట్ ఫర్ ఎగ్జయిటింగ్ డిటైయిల్స్...!