మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుక నిన్న (10.11.2018) ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా 'అమర్ అక్బర్ ఆంటోని' ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పేసాడు రవితేజ.
''శ్రీను వైట్ల లో మంచి నటుడు ఉన్నాడు. కామెడీ యాంగిల్ ఉంది. హిలేరియస్ గా నవ్వించగలడు. తనతో నేను మూడు సినిమాలు చేసాను. ఫస్ట్ సినిమా 'నీ కోసం'. ఇది లవ్ స్టోరీ. ఆ తర్వాత 'వెంకీ', 'దుబాయ్ శీను' సినిమాలు చేసాను. ఈ రెండు సినిమాలు కామెడీ ఎంటర్ టైనర్స్ గా తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు కలిస్తే 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా. ఇక నిర్మాతల విషయానికొస్తే, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను రెడీ'' అని చెప్పాడు రవితేజ.
నవంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలవుతున్న 'అమర్ అక్బర్ ఆంటోని' లో ఇలియానా కథానాయికగా నటించింది. టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఈ సినిమా ద్వారా ఇస్తున్న ఇలియానా టాలీవుడ్ మళ్లీ తన హవా కొనసాగిస్తుందేమో వేచి చూద్దాం.