'ఎన్టీఆర్-కథానాయకుడు' చిత్రం షూటింగ్ మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో జరిగింది. నిన్న ఈ మూడు రోజుల షూటింగ్ పూర్తయ్యింది. 'దానవీరశూరకర్ణ' చిత్రంలోని కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారట.
ఫస్ట్ డే 'చిత్రం భళారే విచిత్రం..' పాటలోని సన్నివేశాలను తెరకెక్కించారట. ఈ పాటకు ఎన్టీఆర్ పాత్ర చేస్తున్న బాలయ్యతో హీరోయిన్ శ్రియసరన్ డ్యాన్స్ చేసిందట. రెండో రోజు అర్జునుడు పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారట. అర్జునుడు పాత్రలో నందమూరి అబ్బాయ్ కళ్యాణ్ రామ్ నటించాడట. ఇక మూడో రోజు కర్ణుడు పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారట. దీంతో ఈ మూడు రోజుల షూటింగ్ పూర్తయ్యిందని సమాచారమ్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. జనవరి 9న 'ఎన్టీఆర్ - కథానాయకుడు' థియేటర్స్ కి వస్తోంది.