మెగా పవర్ స్టార్ రాంచరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా 'వినయ విధేయ రామ' షూటింగ్ చివరి దశలో ఉంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే ఓ పాటను చిత్రీకరించారట. ఈ పాట పక్కా మాస్ సాంగ్ అని తెలుస్తోంది. ఇక ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయ్యిందట. ఈ పాటను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇది పక్కా క్లాస్ సాంగ్ అని సమాచారమ్. రాంచరణ్, కియారా అద్వానీలపై ఈ పాటను చిత్రీకరించబోతున్నారట. ఇదిలా ఉంటే...
ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లోనే 15.1 మిలియన్ వ్య్వూస్ దక్కించుకుని ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ని తెలియజేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పక్కా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను మించే విధంగా ఈ సినిమా ఉంటుందా... భారీ విజయాన్ని ఈ చిత్రం టీం చవిచూస్తుందా వేచి చూద్దాం.