స్టార్ డైరెక్టర్ రాజమౌళి భారీ ప్లానింగ్ తో #RRR మల్టీస్టారర్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల19 నుంచి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆరంభంకానుంది. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ఎన్టీఆర్, రాంచరణ్ పాల్గొనగా చిత్రీకరించబోతున్నారట. ఈ షెడ్యూల్ తర్వాత కూడా భారీ ప్లానింగ్ ఉన్నారట రాజమౌళి. ఆ వివరాల్లోకి వెళితే...
డార్జిలింగ్ లో ఓ షెడ్యూల్ ని జరపడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇందుకోసం కావాల్సిన లీగల్ పర్మిషన్ ని తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఈ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. అక్కడ కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించబోతున్నారని వినికిడి. అయితే డార్జిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుందని మాత్రం బయటకి రాలేదు. ప్రస్తుతం హీరోయిన్ల ఎంపికకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే హీరోయిన్లు కూడా ఫైనలైజ్ అయిపోతారని సమాచారమ్.