దివంగత నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని రాజకీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తాత ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి పార్టీ తరఫున కుకట్ పల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు ఆమె. అక్కసుహాసిని సపోర్ట్ చేస్తూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. అక్కను ఆదరించాలని కోరారు. ట్విట్టర్ ద్వారా కూడా అక్క సుహాసినికి తాము అండగా ఉంటామని, ఆమెను గెలిపించాలని కోరారు. ఇంతవరకూ బాగానే ఉంది. కేవలం ప్రెస్ నోట్, ట్విట్టర్ లో ట్వీట్ మాత్రమేనా అక్క కోసం డైరెక్ట్ గా రంగంతోకి దిగుతారా అనే చర్చ జరుగుతోంది.
అక్క సుహాసిని తరఫున కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. నిజంగా ఈ తమ్ముళ్లు రంగంలోకి దిగి అక్క తరఫున ప్రచారం చేస్తే, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. టిడిపి కార్యకర్తలతో పాటు నందమూరి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపినవారవుతారు. బాబాయ్ బాలకృష్ణతో కలిసి కళ్యాణ్ రామ్ అక్క కోసం ప్రచారం చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరితో పాటు ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగుతాడేమో వేచిచూద్దాం.