ఎన్టీఆర్ - కథానాయకుడు లో లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్రను ఆయన మనవడు సుమంత్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కినేని కోడలు సమంత ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించనుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. లెజండరీ యాక్టరస్ భానుమతి పాత్రను సమంతతో చేయించాలని డైరెక్టర్ క్రిష్ భావిస్తున్నారట. సమంతతో చర్చలు జరుపుతున్నారట. సమంత ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటుల సంఖ్య చాలా పెద్దది.
సావిత్రమ్మగా నిత్యామీనన్, బి.సరోజాదేవిగా అనుష్క, కృష్ణకుమారి పాత్రలో మాళవిక నాయర్, ప్రభ పాత్రలో శ్రియ, జయప్రద పాత్రలో తమన్నా, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్... ఇలా 'ఎన్టీఆర్ - మహానాయకుడు' కోసం ఒకప్పటి లెజండరీ హీరోయిన్స్ పాత్రల్లో నటిస్తున్న ఇప్పటి హీరోయిన్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఒక్కో పాత్రకి ఎంపిక చేస్తున్న నటీనటులు ఆ పాత్రలో ఎలా ఉంటారోననే ఆసక్తి అందరిలో ఉంది. లెజండరీ యాక్టర్ ఎన్టీఆర్ 'బయోపిక్' లో భాగంగా ముందుగా విడుదలవ్వబోతున్న ఫస్ట్ పార్ట్ 'ఎన్టీఆర్ - కథానాయకుడు' జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్స్ కి రానుంది.