'ఎన్టీఆర్ - కథానాయకుడు' ఫస్ట్ బెనిఫిట్ షో ఈ రోజు (9.1.2019) ఉదయం 6 గంటలకు కుకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ లో స్క్రీనింగ్ జరిగింది. నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ షో కి అటెండ్ అవ్వడంతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. థియేటర్ పరిసన ప్రాంతాలు 'జై ఎన్టీఆర్', 'జై బాలయ్య' నినాదాలతో మారుమ్రోగాయి. డైరెక్టర్ క్రిష్, నందమూరి కళ్యాణ్ రామ్ కూడా అటెండ్ అయ్యారు.
ఇక 'ఎన్టీఆర్ బయోపిక్' లో బసవరామతారకం పాత్ర చేసిన విద్యాబాలన్ కూడా ఈ షో ని తిలకించారు. ట్విస్ట్ ఏంటంటే... విద్యాబాలన్ తో పాటు ఆమె భర్త సిద్ధార్ధ్ రాయ్ కపూర్ కూడా ఈ బెనిఫిట్ షో కి అటెండ్ అయ్యారు. దంపతులు ఇద్దరూ సినిమాని ఎంజాయ్ చేసారు. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. యుటివి, వాల్ట్ డిస్నీ ల మాజీ బాస్ అయిన సిద్ధార్ధ్ రాయ్ కపూర్ 'ఎన్టీఆర్ బయోపిక్' హిందీ శాటిలైట్ రైట్స్ ని అమ్మడానికి హెల్స్ చేసారని సమాచారమ్.