'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వాని ప్రస్తుతం టాలీవుడ్ దర్శక, నిర్మాతలకు షాకిస్తోందని తెలుస్తోంది. రెండు భారీ ప్రాజెక్ట్స్, స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రావడంతో అమ్మడు ఇక పారితోషికం విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యిందట. ఇకముందు కమిట్ అయ్యే సినిమాలకు భారీ రెమ్యురేషన్ డిమాండ్ చేస్తోందట. ఆ వివరాల్లోకి వెళితే...
'వినయ విధేయ రామ' కోసం తీసుకున్న పారితోషికం ని డబుల్ చేసిందట. కోటి 25 లక్షలు పారితోషికం కావాలని డిమాండ్ చేస్తోందట. ఒకేసారి ఇంత పెంచడం కియారాని అప్రోచ్ అవుతున్న దర్శక, నిర్మాతలను ఖంగుతినిపిస్తోందని తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా సంపత్ నంది ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం కియారాని అప్రోచ్ అయ్యారట. అమ్మడు 1.25 లక్షలు పారితోషికం డిమాండ్ చేయడంతో అవాక్కయ్యారట. మరి ఒకేసారి ఇంత పారితోషికం పెంచడం కియారాకి ప్లస్ అవుతుందో, మైనస్ అవుతుందో వేచిచూద్దాం. మొత్తం మీద దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అమ్మడు డిసైడ్ అయినట్టుంది. తెలివైనదే...!