స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక హాసిని బ్యానర్ల పై ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఎగ్జయిటింగ్ అప్ డేట్ ప్రచారమవుతోంది. అదేంటంటే...
ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యుయెల్ రెల్ చేయబోతున్నాడని వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ రెండు పాత్రలను త్రివిక్రమ్ అద్భుతంగా తీర్చిదిద్దారట. రెండు గెటప్ లు, రెండు పాత్రలు దేనికదే డిఫరెంట్ గా ఉంటుందని సమాచారమ్. ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్ అభిమానులకు ఇంతకంటే మంచి వార్త ఏముంటుంది. తండ్రి, కొడుకు అనుబంధం నేపధ్యంలో ఈ చిత్రం స్టోరీ లైన్ ఉంటుందట. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' లాంటి హిట్ చిత్రాలు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందాయి. ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మరి ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్ ని కొడతారేమో వేచిచూద్దాం.