మాస్ రాజా రవితేజతో 'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ చిత్రం 'తెరి' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం స్ర్కిఫ్ట్ కి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. ఇదిలా ఉంటే...
ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటికి వచ్చింది. 'కనకదుర్గ' టైటిల్ ని ఈ సినిమాకి పెట్టాలనుకుంటున్నారట. చాలా పవర్ ఫుల్ టైటిల్ ఇది. మాస్ రాజా రవితేజకు సరిపోయే టైటిల్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా కోసం ఓ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. మరో హీరోయిన్ గా క్యాథరీన్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ పాటలందించబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 15నుంచి ఆరంభంకానుందట. సో... 'డిస్కోరాజా' సినిమా చేస్తూ బిజీగా ఉన్న రవితేజ, ఈ సినిమాతో పాటే 'కనకదుర్గ' షూటింగ్ లో కూడా పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారమ్.