డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం టిడిపి పార్టీకి సంబంధించిన యాడ్స్ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. అమరావతిలో ఉంటూ ఈ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. నిజం చెప్పాలంటే టిడిపికి సంబంధించిన పొలిటికల్ యాడ్స్ చిత్రీకరణ స్టార్ డైరెక్టర్ రాజమౌళితో చేయించాలని భావించారట. అయితే ఈ ఆఫర్ ని రాజమౌళి సున్నితంగా తిరస్కరించారని సమాచారమ్. ఆ వివరాల్లోకి వెళితే...
#RRR సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ యాడ్స్ చిత్రీకరణ కోసం టైమ్ కేటాయించలేనని చెప్పారట రాజమౌళి. దాంతో బోయపాటి శ్రీనును రంగంలోకి దింపింది టిడిపి గవర్నమెంట్. రాజమౌళి, బోయపాటి శ్రీను ఇద్దరూ టిడిపి కోసం ఇంతకుముందే వర్క్ చేసారు. అమరావతి డిజైన్ విషయంలో రాజమౌళి సహకారం అందించారు. టిడిపి గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగిన పుష్కరాల సమయంలో బోయపాటి కొన్ని యాడ్స్ కి దర్శకత్వం వహించారు. ఇప్పుడు జరగబోతున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల కోసం బోయపాటి ఆధ్వర్యంలో టిడిపి యాడ్స్ చిత్రీకరణ జరుగుతున్నాయి.