టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీ ఎట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాలో టైగర్ నాగేశ్వరరావు పెద్ద అక్క పాత్ర చేయబోతోంది రేణు. 'దొంగాట', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' ఫేం వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమాకి హీరోయిన్ కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
'ఆర్ ఎక్స్ 100' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన పాయల్ రాజ్ ఫుత్ కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 'వెంకీమామ' చిత్రంలో ఆఫర్ కొట్టేసిన పాయల్ రాజ్ ఫుత్ కి నాగార్జున 'మన్మధుడు' సీక్వెల్ లో నటించే అవకాశం వచ్చిందని సమాచారమ్. తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా రూపొందనున్న టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసిందని తెలుస్తోంది. ఈ సినిమా అగ్రిమెంట్ కి సైన్ చేయడానికి సమాయత్తమవుతోందట పాయల్. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ ఫుత్. ఆమె ఈ సినిమాలో నటించడం సినిమాకి ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.