స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటివరకూ 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతాగ్యారేజ్', 'భరత్ అనే నేను' వంటి హిట్ చిత్రాలు చేసాడు. ఈ సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతదర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాల ఆడియో ఆల్బమ్స్ లోని కొన్ని పాటలు చార్ట్ బస్టింగ్ పాటలుగా నిలిచాయి. దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసాడు. అయినా సరే మెగాస్టార్ చిరంజీవితో కొరటాలశివ చేయబోతున్న సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా చేయబోవడంలేదు. దానికి కారణం మెగా పవర్ స్టార్ రాంచరణ్.
కొరటాల శివ తదుపరి సినిమా చిరు హీరోగా తెరకెక్కనుంది. రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కాగా ఈ సినిమాకి అమిత్ త్రివేదిని సంగీతదర్శకుడిగా తీసుకుందామని కొరటాల దగ్గర చెప్పాడట చరణ్. ప్రస్తుతం చిరు 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి అమిత్ త్రివేది సంగీతదర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకి అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడట. అతని వర్క్ పట్ల ఫుల్లుగా ఇంప్రెస్ అయిన చిరు, చరణ్ తమ బ్యానర్ లో తెరకెక్కనున్న నెక్ట్స్ సినిమాకి కూడా అమిత్ త్రివేదినే సంగీతదర్శకుడిగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఈ విషయాన్నే కొరటాల శివకు చెప్పారట. దాంతో కొరటాల కూడా దేవిశ్రీప్రసాద్ ని వదిలేసి అమిత్ త్రివేదిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. సో... చిరుతో కొరటాల చేయబోతున్న సినిమాకి దేవి ఉండడని ఫిక్స్ అయిపోవచ్చు.