డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఉంది. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు త్రివిక్రమ్ కి ఓ ప్రపోజల్ పెట్టారట. అదేంటంటే...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డేట్స్ మైత్రి మూవీ మేకర్స్ కి ఉన్నాయట. కాగా ప్రభాస్ కోసం ఓ స్టోరీ లైన్ తయారు చేయాల్సిందిగా త్రివిక్రమ్ ని కోరారట ఈ సంస్థ అధినేతలు. ఇప్పటివరకూ త్రివిక్రమ్, ప్రభాస్ కలిసి సినిమా చేయలేదు. ఈ ఇద్దరూ కలిస్తే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్, ప్రభాస్ కాంబినేషన్ ని సెట్ చేసి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని వర్కవుట్ చేసుకోవాలనే ప్లాన్ తో ఉన్నారట మైత్రి మూవీ మేకర్స్. మరి ప్రభాస్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి స్టోరీ లైన్ తయారు చేస్తాడో, ఎప్పటికి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో వేచిచూద్దాం.