అక్కినేని అఖిల్ తదుపరి సినిమాకి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన ఓ స్టోరీ లైన్ బాగా నచ్చడంతో అఖిల్ అక్కినేని ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి తాజా వార్తల ప్రకారం హీరోయిన్ ఖరారయ్యిందని తెలుస్తోంది. 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాల ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ ని అలరించిన కియారా అద్వానీని ఈ సినిమా కోసం హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారమ్. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.