యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' ఆగస్ట్ 15న థియేటర్స్ కి రానున్న సంగతి తెలిసిందే. దీంతో పాటే 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా ఓ షెడ్యూల్ యూరోప్ లో జరిగింది.
తాజాగా మరో షెడ్యూల్ రేపట్నుంచి (21.3.2019) అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ స్టూడియోలో వేసిన ఓ సెట్ లో ప్రభాస్ పాల్గొనగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. 16 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డె కథానాయికగా నటిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇక్కడ షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూరోప్ లో మరో షెడ్యూల్ జరగనుంది. ఈ సినిమాకి 'జానూ' టైటిల్ ని పరిశీలిస్తున్నారని సమాచారమ్.